‘సంగమిత్ర’. ఈ సినిమా ఫస్ట్లుక్ను చిత్ర బృందం గురువారం విడుదల చేసింది. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్తో రూపొందిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ యువరాణి పాత్రలో కన్పించనుంది. ఇక ఈ సినిమాలో ఆర్య, జయం రవి కూడా నటిస్తున్నారు. ఈ చిత్రం ‘బాహుబలి’ తరహాలో రెండు భాగాలుగా రూపొందిస్తారని సమాచారం. ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాను తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించబోతున్నారు.