ఇప్పుడు దేశంలో చవక ఫోన్ల హవా నడుస్తోంది. రిలయన్స్ జియో ప్రకటించిన 4జీ ఫీచర్ ఫోన్ ఇటీవలే వినియోగదారుల చేతుల్లోకి రాగా ఇప్పుడు టెలికం సంస్థలన్నీ ఇదే బాట పట్టాయి. అతి త్వరలో ఎయిర్టెల్ నుంచి రూ.2 వేల లోపు స్మార్ట్ ఫోన్ రానుండగా, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా చవకఫోన్లపై దృష్టి సారించింది. ఇప్పుడు మరో టెలికం సంస్థ వొడాఫోన్ వంతు వచ్చింది. ఎంట్రీ లెవల్ 4జీ స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రూ.999 కే ఈ ఫోన్ను అందించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం దేశీయ మొబైల్ మేకర్ మైక్రోమ్యాక్స్తో చేతులు కలిపింది. భారత్-2 అల్ట్రా పేరుతో 4జీ స్మార్ట్ఫోన్ను తీసుకురానున్నట్టు తెలిపింది. నిజానికి ఈ ఫోన్ అసలు ధర రూ.2899 కాగా మూడేళ్ల తర్వాత రూ.1900 వెనక్కి ఇవ్వనుంది. కాగా, ఇదే మైక్రోమ్యాక్స్తో కలిసి బీఎస్ఎన్ఎల్ భారత్-1 4జీ ఫీచర్ ఫోన్ను తీసుకొస్తోంది. అలాగే మరో మొబైల్ మేకర్ కార్బన్తో కలిసి ఎయిర్టెల్ 4జీ స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. తాజాగా వొడాఫోన్ భారత్-2 అల్ట్రా పేరుతో స్మార్ట్ఫోన్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.
ఫీచర్లు ఇలా.. భారత్ అల్ట్రా-2 మొబైల్లో అంగుళాల డిస్ప్లే, 512 ఎంబీ ర్యామ్, 1.3 గిగాహెడ్జ్ ప్రాసెసర్, 4జీబీ మెమొరీ, 2 మెగాపిక్సల్ రియర్, 0.3 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్, 1300 ఎంఏహెచ్ బ్యాటరీ.