కుశ టీజర్ అదిరిందిగా


ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ’. బాబి దర్శకుడు. ఈ చిత్రంలో తారక్‌ ‘జై’, ‘లవ’, ‘కుశ’ పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని మూడో పాత్రైన ‘కుశ’ను పరిచయం చేసిన చిత్రబృందం ఇప్పుడు టీజర్‌ను విడుదల చేసింది.
టీజర్‌లో తారక్‌.. ‘కొట్టేయడంతో పాటు కొట్టడమూ వచ్చురా’ అని చెప్తున్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ‘ఈ డబ్బు తీసుకెళ్లి అమెరికాలోఇన్వెస్ట్‌ చేసి ఆ ఆధార్‌ కార్డేదో నాకు ఇప్పిచ్చేయండి బాబూ’ అని తారక్‌ అంటుంటే.. ‘దాన్ని ఆధార్‌ కార్డు అనరమ్మా గ్రీన్‌ కార్డు అంటారు’ అని చెప్పడం ఫన్నీగా ఉంది.
ఈ చిత్రంలో తారక్‌కి జోడీగా రాశీ ఖన్నా, నివేదా థామస్‌ నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం సెప్టెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది