ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సైబర్‌ దాడి: రాన్సమ్‌వేర్‌

ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సైబర్‌ దాడి: 
కొన్ని దేశాల్లో శుక్రవారం ఉన్నట్లుండి గందరగోళం నెలకొంది  వేల సంఖ్యలో కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. రష్యా రాజధాని మాస్కోలోని సైబర్‌ సెక్యూరిటీ సంస్థ కాస్పర్‌స్కై ల్యాబ్‌ ఈ విషయాన్ని వెల్లడించింది.

మొదట బ్రిటన్‌లోని పలు ఆసుపత్రులపై సైబర్‌ దాడి జరిగింది. ఐటీ వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కంప్యూటర్లు తిరిగి పనిచేయాలంటే డబ్బులు చెల్లించాలన్న సందేశం తెరలపై కనబడటంతో అధికారులు విస్తుపోయారు. ఏం జరిగిందా..? అని ఆరా తీశారు. ఇంతలోనే ఈ దాడి ప్రపంచమంతా పాకింది. ‘వానా క్రై రాన్సమ్‌వేర్‌’ ద్వారా కంప్యూటర్లను హ్యాక్‌ చేసినట్లు తెలిసింది. 
మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో ఎస్‌ఎంబీవీ2 అనే రిమోట్‌కోడ్‌తో ‘వానా క్రై’ అనే రాన్సమ్‌వేర్‌తో హ్యాకర్లు దాడి చేసినట్లు తెలుస్తోంది. మొదట ఇంగ్లాండ్‌లోని నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ సైబర్‌ దాడికి గురై.. చాలా ఆసుపత్రిల్లోని అత్యవసర సేవలు స్తంభించాయి. 
టర్కీ, వియత్నాం, ఫిలిప్పీన్స్‌, జపాన్‌, అమెరికా, చైనా, స్పెయిన్‌, ఇటలీ, తైవాన్‌, రష్యాల్లోనూ సైబర్‌ దాడులు జరిగాయి. అన్ని దేశాల్లోనూ ఇదే రాన్సమ్‌వేర్‌తో హ్యాక్‌ చేసినట్లు తెలిసింది. కంప్యూటర్లను అన్‌లాక్‌ చేయాలంటే 300 డాలర్లు ఇవ్వాలన్న సందేశం కనిపించిందని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది.

అయితే ఈ దాడులు ఎవరు చేశారన్నది మాత్రం ఇంతవరకు అంచనాకు రాలేకపోతున్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది